గత కొద్ది వారాలుగా సామాన్యుడిని కలవరపెట్టిన కూరగాయల ధరలు, ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా టమాటా ధర కిలో రూ.10కి పడిపోవడంతో వినియోగదారులకు ఊరట లభించింది. అయితే, ఈ ధరల పతనం రైతులకు ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లలో కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో టమాటా ధర కిలో రూ.10కి చేరడంతో సామాన్యుడికి ఉపశమనం కలిగింది. గతంలో రూ.30-50 వరకు ఉన్న టమాటా ధరలు, దిగుబడి పెరగడంతో గణనీయంగా తగ్గాయని వ్యాపారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
టమాటా తో పాటు, క్యారెట్, బీట్ రూట్ వంటి కూరగాయల ధరలు కూడా తగ్గాయి. హైదరాబాద్లో క్యారెట్ కిలో రూ.20-21, బీట్ రూట్ రూ.15కు లభిస్తుండగా, విజయవాడలో క్యారెట్ రూ.24, బీట్ రూట్ రూ.26కు చేరుకుంది. గతంలో ఈ ధరలు రూ.100 వరకు చేరేవి.









