నాలుగు నెలల గర్భవతి అయిన భార్యపై భర్త కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, 8 నెలల క్రితం కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్కు చెందిన వైష్ణవి (19) ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి మాదాపూర్లోనే నివాసం ఉంటున్నారు. హరిబాబు ప్రభుత్వ ఆస్పత్రిలో ఒప్పంద పద్ధతిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వైష్ణవి యూట్యూబ్ ఛానల్ నడుపుతూ, రీల్స్ చేస్తూ ఉండేది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గత కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 4 గంటలకు హరిబాబు, వైష్ణవిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.











