ఇషా యోగా కేంద్రంలో జరిగిన మహాశివరాత్రి వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రసారం పొందాయి.
ఇషా యోగా కేంద్రంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఆదియోగి ప్రాంగణం లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసింది. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు శివనామస్మరణతో పులకించిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రపంచవ్యాప్తంగా 25 భాషల్లో, సంకేత భాషతో సహా, 200కు పైగా ఛానెల్స్ మరియు డిజిటల్ ప్లాట్ఫాంల ద్వారా ఈ వేడుకలు ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. సుమారు 15 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని వీక్షించినట్లు అంచనా.












