దర్శకుడు సుదీప్తో సేన్ రూపొందించిన 'ద కేరళ స్టోరీ-2' సినిమా ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికే తీవ్ర దుమారాన్ని రేపింది. ట్రైలర్ ప్రారంభంలోనే ఉన్న ఒక డైలాగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం షరియా చట్టాలను అమలు చేసే ఇస్లామిక్ రాజ్యంగా మారుతుందని ట్రైలర్లో పేర్కొన్న వాక్యాలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో, వివిధ వర్గాల్లో విస్తృతంగా చర్చించబడుతున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మొదటి భాగం కేరళ నేపథ్యంలో సాగగా, 'ద కేరళ స్టోరీ-2' కథ రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించినట్లు ట్రైలర్ సూచిస్తోంది. మత మార్పిడి అంశం ఈ చిత్రంలో కూడా ప్రధానంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.











