ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్త మానవ పాపిల్లోమావైరస్ (HPV) టీకా కార్యక్రమాన్ని ఈరోజు రాజస్థాన్లోని అజ్మేర్ నుండి ప్రారంభించారు. 14 ఏళ్ల బాలికలను లక్ష్యంగా చేసుకుని అమలు చేయబడుతున్న ఈ కార్యక్రమం, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.15 కోట్ల మంది 14 ఏళ్ల బాలికలకు టీకాలు ఉచితంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టీకాను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో అందజేస్తారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహిళల్లో రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్గా కొనసాగుతోంది. గ్లోబోకాన్ 2022 డేటా ప్రకారం, ప్రతి సంవత్సరం లక్షా 20 వేలకు పైగా కొత్త కేసులు, దాదాపు 80 వేల మరణాలు సంభవిస్తున్నాయి. అధిక-ప్రమాదకరమైన HPV రకాల వల్లనే ఈ క్యాన్సర్ వస్తుందని శాస్త్రీయ ఆధారాలున్నాయి.











