ఖతార్లోని భారత రాయబార కార్యాలయం, దోహాలో చిక్కుకుపోయిన సుమారు వెయ్యి మంది భారతీయులను ఖతార్ ఎయిర్వేస్ విమానాల ద్వారా స్వదేశానికి తరలించినట్లు ప్రకటించింది. నేడు ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు మరిన్ని విమానాలు నడపనున్నట్లు తెలిపింది.
గత మూడు రోజులుగా దోహాలో విమాన ప్రయాణ మధ్యలో లేదా స్వల్పకాలిక సందర్శనల నిమిత్తం చిక్కుకుపోయిన సుమారు వెయ్యి మంది భారతీయులను ఖతార్ ఎయిర్వేస్ విమానాల ద్వారా స్వదేశానికి తరలించినట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఖతార్ ఎయిర్వేస్ నిన్న నిర్వహించిన దోహా-న్యూఢిల్లీ విమానంలో 300 మందికి పైగా భారతీయ ప్రయాణికులు భారత్కు చేరుకున్నారని రాయబార కార్యాలయం తెలిపింది. ప్రయాణికులు తమ ప్రయాణ వివరాల కోసం ఎయిర్లైన్స్ను సంప్రదించాలని సూచించింది.
నేడు ఢిల్లీ, ముంబై మరియు కొచ్చి నగరాలకు మూడు విమానాలను నడపడానికి ఖతార్ ఎయిర్వేస్ ప్రణాళికలు సిద్ధం చేసిందని రాయబార కార్యాలయం తెలియజేసింది. భారత్కు ప్రయాణించాలనుకునే చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణికులు ఈ విమానాలను ఉపయోగించుకోవాలని కోరింది.
సౌదీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ప్రయాణికుల కేసులను పరిశీలిస్తున్నామని, ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటించాలని, పుకార్లను నమ్మవద్దని రాయబార కార్యాలయం సూచించింది.











