మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్ సహా 11 దేశాల గగనతలంపై భారత విమానాలను నడపకుండా నిషేధం విధించింది.
భారత విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ఏవియేషన్ సంస్థలకు కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, లెబనాన్, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా వంటి 11 దేశాల గగనతలంపై విమానాలను నడపవద్దని స్పష్టం చేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రతీకార దాడుల భయం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, FL-320 కంటే తక్కువ ఎత్తులో విమానాలను నడపరాదని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అమలులోకి వచ్చాయి.











