ప్రొద్దుటూరు, జూన్ 28
ప్రొద్దుటూరు–జమ్మలమడుగు మార్గమధ్యంలోని పెద్ద శెట్టిపల్లి సమీపంలో శనివారం రాత్రి ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహం నుజ్జునుజ్జు కావడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది.
ప్రొద్దుటూరు–జమ్మలమడుగు మార్గమధ్యంలోని పెద్ద శెట్టిపల్లి సమీపంలో శనివారం రాత్రి ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలుకింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్ఐ భాస్కర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ఎవరు? ఏ ప్రాంతానికి చెందినవారు? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు.
మృతుడు బిస్కెట్ కలర్ చొక్కా, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహం తీవ్రంగా నుజ్జు కావడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది.











