విధి నిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీ చేస్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) వెంకన్న, గణపురం మండలం చెల్పూర్ శివారులో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. వేగంగా వచ్చిన బొగ్గు టిప్పర్ లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
కేవలం 15 రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన డీటీఓ వెంకన్న, రహదారి భద్రతను పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. పరకాల – భూపాలపల్లి హైవేపై వాహనాల తనిఖీ చేపడుతుండగా, మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్ లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రమాదం జరిగిన తీరు అత్యంత విషాదకరంగా ఉందని, అధికారి మృతదేహం నుజ్జునుజ్జయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటనతో తోటి సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.









