ప్రభుత్వాలు మారినా, విధానాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగానే సాగుతున్నాయనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక 'పెట్టుబడిదారుల పక్షం'గా వ్యవహరిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, 'క్రోనీ క్యాపిటలిజం'పై సమగ్ర విశ్లేషణ.
భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ప్రజల కోసం నడవాలి. అయితే, గత మూడు దశాబ్దాలుగా అధికారం కొద్దిమంది ధనవంతుల చేతుల్లో కేంద్రీకృతమవుతోందని గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది 'క్రోనీ క్యాపిటలిజం'కు నిదర్శనంగా విమర్శకులు భావిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నీతి అయోగ్ గతంలో ఒక సంస్థకు ఒకటికి మించి విమానాశ్రయాలను కట్టబెట్టకూడదని హెచ్చరించినా, కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్కు అప్పగించింది. ఒకే సంస్థ చేతిలో ఓడరేవులు, విమానాశ్రయాలు ఉండటం వల్ల పోటీ తగ్గి, వినియోగదారులపై చార్జీల భారం పెరిగే అవకాశం ఉంది.











