బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్ పరిధిలో ఒక వ్యక్తి తొమ్మిది మంది పాఠశాల విద్యార్థినులపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. చాక్లెట్లు ఇస్తానని ఆశచూపి ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.
35 ఏళ్ల నిందితుడు పాఠశాల ఆవరణలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సమాచారం. పిల్లలు తమకు జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆగ్రహించిన తల్లిదండ్రులు ఫిబ్రవరి 20న నిందితుడిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అప్పగించే క్రమంలో అతనికి దేహశుద్ధి జరిగినట్లు తెలిసింది.











