చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, కొటాల గ్రామంలో భూ వివాదంలో ఒక మహిళపై టీడీపీ కార్యకర్త విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. సర్వే నెంబర్ 445/1A లోని 38 సెంట్ల స్థలం విషయంలో ఈ ఘర్షణ జరిగింది.
బాధితురాలు విశ్వేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం, భూ వివాదంలో జోక్యం చేసుకున్న టీడీపీ కార్యకర్త నాగరాజు నాయుడు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ, నాగరాజు నాయుడు ఆ స్థలంలో దౌర్జన్యం చేశారని విశ్వేశ్వరి ఆరోపించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ దాడి వెనుక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, హేమ కుమార్, వంశీ ఒత్తిళ్లు ఉన్నాయని బాధితురాలు ఆరోపించారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగడం లేదని, తమకు ప్రాణహాని ఉందని విశ్వేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.











