ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత భర్తను హత్య చేయించిన భార్యతో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ సంఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది.
ఖమ్మం గాంధీనగర్కు చెందిన చాగంటి రవి, పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య ప్రశాంతి, భర్త చనిపోతే వచ్చే బీమా డబ్బులతో ఆర్థికంగా లబ్ధి పొందాలని పథకం రచించింది. ఇందుకోసం, రవి పేరున రూ. 66 లక్షల బీమా పాలసీ చేయించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ నెల 2వ తేదీన, ప్రశాంతి తన భర్తకు అధిక మొత్తంలో మద్యం తాగించి, మత్తులో ఉన్న సమయంలో కారుతో ఢీకొట్టి హత్య చేయించింది. అనంతరం, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది.











