ములకలచెరువు మండలం నాయనచెరువు పల్లెకు చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై జనసేన పార్టీ కార్యకర్త హరినాథ్ పై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టారు.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం నాయనచెరువు పల్లెకు చెందిన మైనర్ బాలిక అదృశ్యమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఫిర్యాదులో, అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త హరినాథ్ పై కిడ్నాప్ ఆరోపణలు చేశారు. హరినాథ్, తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి పోతుల సాయినాథ్ సోదరుడని తెలిసింది.











