తాడేపల్లిలో ప్రేమ వ్యవహారంలో యువతి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రియుడి వేధింపుల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో శ్రీనివాసరెడ్డి, రమణమ్మ దంపతుల కుమార్తె మీనాక్షి (డిగ్రీ విద్యార్థిని) తమ ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు రహీం వేధింపులే దీనికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పోలీసుల కథనం ప్రకారం, మీనాక్షి, రహీం ఒకే కళాశాలలో చదువుతున్నప్పుడు పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ క్రమంలో రహీం, మీనాక్షిల సన్నిహిత ఫోటోలు తీశాడు. అయితే, మీనాక్షికి రహీం ప్రవర్తన నచ్చకపోవడంతో అతనికి దూరంగా ఉండటం ప్రారంభించింది.











