మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా కేసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని రూ.1.66 కోట్లు అపహరించిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. సీబీఐ అధికారులమని చెప్పుకుంటూ వీడియో కాల్ చేసి, బెదిరించి ఈ మోసానికి పాల్పడ్డారు.
సైబర్ నేరగాళ్లు సీబీఐ అధికారులమని నమ్మించి, రిటైర్డ్ న్యాయమూర్తికి వీడియో కాల్ చేశారు. బెంగళూరులో తనపై కేసు నమోదైందని, తక్షణమే డిజిటల్ అరెస్ట్ చేయాల్సి వస్తుందని బెదిరించారు. ఈ క్రమంలో, న్యాయమూర్తిని భయపెట్టి, కేసు నుంచి తప్పించాలంటే భారీగా డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
భయాందోళనకు గురైన రిటైర్డ్ న్యాయమూర్తి, సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలను నిజమని నమ్మి, వారి సూచనల మేరకు తన బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1.66 కోట్లను వారికి బదిలీ చేశారు. డబ్బు బదిలీ పూర్తయిన తర్వాత, నేరగాళ్లు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అదృశ్యమయ్యారు.











