సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మధ్యప్రాచ్య ప్రాంతంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. ఫలితాల ప్రకటనపై త్వరలో స్పష్టత రానుంది.
మధ్యప్రాచ్య ప్రాంతంలో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఈ నెల 7 నుంచి 11 వరకు జరగాల్సిన పరీక్షలతో పాటు, 2, 5, 6 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు కూడా రద్దు చేయబడ్డాయి. మధ్యప్రాచ్యంలోని విద్యార్థులకు పదో తరగతి ఫలితాల ప్రకటన విధానంపై త్వరలో ప్రత్యేకంగా తెలియజేస్తామని బోర్డు తెలిపింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
12వ తరగతి పరీక్షల విషయానికొస్తే, ఈ నెల 7వ తేదీన జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని సీబీఎస్ఈ వెల్లడించింది. మార్చి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షల షెడ్యూల్ పై రేపు బోర్డు సమీక్ష నిర్వహించనుంది.











