ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్ 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకునే జాతీయ సైన్స్ దినోత్సవం ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ సంవత్సరం "విజ్ఞానంలో మహిళలు: వికసిత భారత్కు ఉత్ప్రేరకాలు" అనే థీమ్తో వేడుకలు నిర్వహిస్తున్నారు.
సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ స్థాయి వేడుకలు జరుగుతాయి. ఈ థీమ్, భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే దార్శనికతతో శాస్త్రీయ పురోగతిని అనుసంధానిస్తూ, శాస్త్ర రంగంలో మహిళల పాత్రను గుర్తిస్తుంది.
సర్ సి.వి. రామన్ 1930లో 'రామన్ ఎఫెక్ట్' ఆవిష్కరణకు నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఈ దినోత్సవం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రజలలో అవగాహన పెంచడానికి, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.
దేశవ్యాప్తంగా వివిధ విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు శాస్త్ర ప్రదర్శనలు, సెమినార్లు, వర్క్షాప్లు వంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. యువతలో శాస్త్రం పట్ల ఆసక్తిని రేకెత్తించడం ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యం.

