నగరి నియోజకవర్గం, పుత్తూరు మండలంలోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల శనివారం తన సిల్వర్ జూబ్లీ వేడుకలను వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకలకు సినీ నటి భాగ్యశ్రీ బోర్సే, హాస్యనటుడు అవినాష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో, ముఖ్య అతిథులుగా విచ్చేసిన భాగ్యశ్రీ బోర్సే, అవినాష్ విద్యార్థులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య సమయం గడిపారు. వారి సమక్షంలో కళాశాల వాతావరణం ఉల్లాసంగా మారింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను చూసేందుకు కళాశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళాశాల ప్రాంగణం జనసంద్రంగా మారింది.











