అఫ్ఘనిస్తాన్ భూభాగంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల్లో పౌరుల మరణం, మౌలిక సదుపాయాల విధ్వంసంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్, పాకిస్తాన్ చర్యలను 'మరో దురాక్రమణ'గా అభివర్ణించారు. సార్వభౌమ ఆఫ్ఘనిస్తాన్ ఆలోచనకు శత్రువుగా ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని ఆయన పేర్కొన్నారు.
భారత్ ఎల్లప్పుడూ అఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలని నొక్కి చెబుతోందని జైస్వాల్ తెలిపారు. ఈ దాడులు ప్రాంతీయ శాంతికి, స్థిరత్వానికి విఘాతం కలిగిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











