దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో, కీలక మతపరమైన, చారిత్రక ప్రదేశాల వద్ద భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు.
నిఘా వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని ప్రముఖ మత, వారసత్వ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీస్ శాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఢిల్లీ పోలీస్, ఇతర భద్రతా సంస్థలు అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా పెంచాయి. ముఖ్యంగా, రద్దీగా ఉండే ప్రదేశాలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాల వద్ద పహారాను పెంచారు. సందర్శకుల తనిఖీలను కూడా కఠినతరం చేశారు.











