గత కొన్నేళ్లుగా భారతదేశ ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. బడ్జెట్ అనంతర వెబినార్లో 'సబ్కా సాథ్ సబ్కా వికాస్ – ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం' అనే అంశంపై ప్రసంగిస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కేవలం చర్చనీయాంశం కాదని, అది బడ్జెట్ పునాది అని, ప్రభుత్వ నిబద్ధత అని ఆయన పేర్కొన్నారు.
దేశం నివారణ మరియు సంపూర్ణ ఆరోగ్యం దిశగా ఒక దార్శనికతతో పనిచేస్తోందని, అనేక జిల్లాల్లో వందలాది కొత్త వైద్య కళాశాలలు ప్రారంభమవుతున్నాయని ప్రధాని మోడీ వివరించారు. ఆయుష్మాన్ భారత్ యోజన మరియు ఆరోగ్య మందిర్ ద్వారా దేశవ్యాప్తంగా గ్రామాలకు ఆరోగ్య సేవలు విస్తరిస్తున్నాయని, అదే సమయంలో యోగా మరియు ఆయుర్వేదం వంటి భారతదేశ సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కేర్ ఎకానమీ (సంరక్షణ ఆర్థిక వ్యవస్థ) పెరుగుదల గురించి ప్రస్తావిస్తూ, సంరక్షకుల (కేర్ గివర్స్) కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ దేశంలోని లక్షలాది మంది యువతకు నైపుణ్యం ఆధారిత ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) రంగాలలో మహిళల సంఖ్య పెరుగుతున్నందుకు ఆయన గర్వం వ్యక్తం చేశారు.











