దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల మైనర్ బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన వాయువ్య ఢిల్లీలోని స్వరూప్ నగర్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల వివరాల ప్రకారం, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నలుగురిలో ముగ్గురు మైనర్లు కాగా, ఒకరు మేజర్గా గుర్తించారు. హత్య అనంతరం మృతదేహాన్ని బహిరంగ ప్రదేశంలో వదిలివెళ్లారు. మృతదేహం తీవ్రంగా దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో మృతురాలి వివరాలను గుర్తించడం కూడా కష్టమైందని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
టెంపోలోనే దాడి
ప్రాథమిక దర్యాప్తులో, ఘటన జరిగిన రోజు బాలిక నిందితులతో కలిసి టెంపోలో ప్రయాణించిందని, అక్కడ మద్యం సేవించిన అనంతరం లైంగిక దాడికి పాల్పడి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని అక్కడే వదిలివెళ్లినట్లు తెలిపారు.











