ఎల్లారెడ్డి, 2026-08-27
ఎల్లారెడ్డి, గాంధారి మండలాల్లోని ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) హియరింగ్ కేంద్రాలను జిల్లా ఇన్చార్జ్ ఇంచార్జ్ ఇంచార్జ్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం తనిఖీ చేశారు. ఓటర్లకు అందుతున్న సేవలు, ధృవపత్రాల సమర్పణ ప్రక్రియను ఆమె పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 10వ వార్డు, గాంధారి మండలం చాడ్మల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) హియరింగ్ కేంద్రాలను జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హియరింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుతున్న సేవలు, నోటీసులు అందుకున్న వారి వివరాలు, ధృవపత్రాల సమర్పణ ప్రక్రియ, హియరింగ్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.












