కేంద్ర ప్రభుత్వ పాలన, విధానాల అమలు, సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమీక్షకు సిద్ధమవుతున్నారు. 24వ తేదీ నుంచి ఢిల్లీలో కేంద్ర కేబినెట్ మంత్రులతో రెండు రోజుల పాటు చింతన్ బైఠక్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని కేంద్ర కేబినెట్ మంత్రులు హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి.
కేంద్ర ప్రభుత్వ పాలన, విధానాల అమలు, సంస్కరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక సమీక్షకు సిద్ధమవుతున్నారు. 24వ తేదీ నుంచి ఢిల్లీలో కేంద్ర కేబినెట్ మంత్రులతో రెండు రోజుల పాటు చింతన్ బైఠక్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అన్ని కేంద్ర కేబినెట్ మంత్రులు హాజరుకానున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పలు నివేదికలు వెల్లడించాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
సంస్కరణలపై ప్రధానంగా చర్చ
ఈ రెండు రోజుల సమావేశంలో ప్రభుత్వ పనితీరు, పాలనలో సంస్కరణలు, విధానాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలు చేపట్టిన సంస్కరణలు, వాటి పురోగతిపై ఆయా శాఖల మంత్రులు ప్రజెంటేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.











