అరేబియా సముద్రంలో భారత నౌకాదళానికి చెందిన యుద్ధనౌక, పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన పీఎన్ఎస్ హునైన్ మధ్య ఢీకొన్న ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఉత్తర అరేబియా సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో జరిగిన ఈ ప్రమాదంలో పాక్ నౌక ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
భారత విదేశాంగ శాఖ వివరాల ప్రకారం, పాకిస్థాన్ నౌక అధిక వేగంతో భారత యుద్ధనౌకకు అత్యంత సమీపంగా వచ్చి, ప్రమాదకరంగా దిశ మార్చుకోవడంతో ఈ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత నౌకకు పెద్దగా నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఘటన తీరు
భారత రక్షణ వర్గాల సమాచారం ప్రకారం, భారత యుద్ధనౌక ఉత్తర అరేబియా సముద్రంలో సాధారణ నిఘా విధుల్లో ఉండగా, పాకిస్థాన్కు చెందిన పీఎన్ఎస్ హునైన్ ఆ నౌకను వెంబడిస్తూ అధిక వేగంతో సమీపించింది. భారత నౌక కమాండర్ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, పాకిస్థాన్ నౌక చివరి దశలో అత్యంత సమీపంగా దిశ మార్చుకోవడంతో రెండు నౌకలు ఢీకొన్నాయి. ఈ ఘటన అనంతరం పీఎన్ఎస్ హునైన్ను మరమ్మతుల కోసం నౌకాశ్రయానికి తరలించారు.











