అంగారక గ్రహంపై నాసా క్యూరియాసిటీ రోవర్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. అంగారకుడిపై తన ప్రయాణంలో 5,000వ మార్టియన్ రోజును (సోల్) పూర్తి చేసుకున్న సందర్భంగా రోవర్ తీసిన చిత్రాలతో నాసా ప్రత్యేకమైన పోస్ట్కార్డ్ను విడుదల చేసింది.
క్యూరియాసిటీ రోవర్ న స్థానిక మార్స్ సమయం ఉదయం 9:56 గంటలకు, అలాగే సాయంత్రం 5:39 గంటలకు చాక్లటల్ () అనే పేరుతో పిలువబడే ఇసుక మైదానం సమీపంలో చిత్రాలను తీసింది. ఈ రెండు సమయాల్లో తీసిన నలుపు-తెలుపు నావిగేషన్ కెమెరా చిత్రాలను భూమికి పంపిన తర్వాత నాసా వాటిని కలిపి ఒకే పనోరమాగా రూపొందించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ చిత్రానికి నీలం, పసుపు రంగులను కళాత్మకంగా జోడించారు. నీలం రంగు ఉదయం తీసిన దృశ్యాన్ని, పసుపు రంగు మధ్యాహ్నం తీసిన దృశ్యాన్ని సూచిస్తుంది. చిత్రంలో రోవర్ వెనుక భాగంలో రేడియో ఐసోటోప్ పవర్ జనరేటర్, కమ్యూనికేషన్ యాంటెన్నా, అలాగే మార్స్ నేలపై రోవర్ ప్రయాణించిన జాడలు కనిపిస్తాయి.











