తమిళనాడులో కూటమి రాజకీయాలపై పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, వీసీకే, కమ్యూనిస్ట్ పార్టీలు, ముస్లిం లీగ్ వంటి పార్టీలు ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకోవడం సరికాదని ఆయన అన్నారు. గతంలో డీఎంకే కూటమిలో పోటీ చేసి గెలిచారని గుర్తుచేశారు.
పెరియార్ జయంతిని పురస్కరించుకుని తైలాపురం తోటలోని పెరియార్ విగ్రహానికి పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అన్బుమణి.. తమిళనాడులోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పందించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కమ్యూనిస్ట్ పార్టీలు ప్రస్తుతం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం కూటమిలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని ఆయన అన్నారు. కూటమిలో కొనసాగుతూనే ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం గందరగోళానికి దారితీసే నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.











