ఆదాయపు పన్ను రిటర్న్ ()లో రూ.38.37 లక్షల నగదు డిపాజిట్లను తొలుత చూపించని ఓ పన్ను చెల్లింపుదారుడికి సంబంధించిన కేసులో ముంబై ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ () కీలక తీర్పు ఇచ్చింది. పన్ను చెల్లింపుదారుడు తర్వాత ఆ ఆదాయాన్ని వెల్లడించి రూ.19.89 లక్షల పన్ను చెల్లించినప్పటికీ, విధించిన రూ.23.94 లక్షల పెనాల్టీని ట్రిబ్యునల్ రద్దు చేసింది.
సవరించిన లెక్కల ప్రకారం రూ.19.89 లక్షల సెల్ఫ్-అసెస్మెంట్ పన్నును కూడా చెల్లించారు. అనంతరం అసెస్మెంట్ అధికారి రూ.38.37 లక్షలను ఇతర ఆదాయంగా పరిగణించారు. ఈ నిర్ణయాన్ని పన్ను చెల్లింపుదారుడు సవాలు చేయలేదు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పెనాల్టీ విధించడానికి కారణం
పన్ను శాఖ ఈ మొత్తాన్ని కేవలం ఆదాయం తక్కువగా చూపించడంగా కాకుండా మిస్రిపోర్టింగ్గా పరిగణించింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 270 కింద మిస్రిపోర్టింగ్కు సంబంధించి, చెల్లించాల్సిన పన్నుపై 200 శాతం వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. ఈ కేసులో అసెస్మెంట్ అధికారి రూ.23.94 లక్షల పెనాల్టీ విధించారు. పన్ను చెల్లింపుదారుడు సెక్షన్ 270 కింద పెనాల్టీ నుంచి మినహాయింపు కోరినప్పటికీ, ఆ దరఖాస్తును అధికారులు అంగీకరించలేదు.











