ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు అనుకోని ఘటన ఎదురైంది. రైల్వే ట్రాక్పైకి అకస్మాత్తుగా వచ్చిన ఓ దూడను రైలు ఢీకొట్టింది. ఈ ఘటన తిలహర్ స్టేషన్కు సమీపంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
వారణాసి నుంచి మీరట్ జంక్షన్ వైపు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ తిలహర్ స్టేషన్కు సమీపంలోకి చేరుకున్న సమయంలో ట్రాక్పైకి దూడ వచ్చింది. రైలు వేగంగా వెళ్తుండటంతో లోకో పైలట్ వెంటనే రైలును ఆపలేకపోయారు. దీంతో రైలు ముందుభాగం దూడను ఢీకొట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రైలు ముందు భాగం దెబ్బతింది
ఢీకొన్న ఘటనలో వందే భారత్ రైలు ముందు భాగంలోని నోస్ కవర్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఘటన అనంతరం లోకో పైలట్ రైల్వే కంట్రోల్కు సమాచారం అందించారు.











