విశ్వవిద్యాలయాల మంజూరీ సంఘం (యూజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (నెట్)కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. 26లో జరిగిన పరీక్షలో ఆంగ్లం, వాణిజ్యం, సామాజిక శాస్త్రం విభాగాలకు నిర్వహించిన పునఃపరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలు, మార్కులు, అర్హత వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు.
ఆంగ్లం, వాణిజ్యం పరీక్షలను న, సామాజిక శాస్త్రం పరీక్షను న నిర్వహించారు. దేశవ్యాప్తంగా 454 పరీక్షా కేంద్రాలు, 272 నగరాల్లో ఈ పునఃపరీక్షలు జరిగాయి. మొత్తం 1,96,491 మంది పరీక్షకు నమోదు చేసుకోగా, 1,20,355 మంది పరీక్షకు హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఫలితాల ప్రకారం 824 మంది జూనియర్ పరిశోధన ఫెలోషిప్కు అర్హత సాధించారు. 11,610 మంది సహాయ ఆచార్యుల అర్హతకు, 23,154 మంది పీహెచ్డీ ప్రవేశానికి మాత్రమే అర్హత పొందారు.











