ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయంలో హోం శాఖ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. పోలీసు బలగాల హేతుబద్ధీకరణ, కొత్త జిల్లాలలో సిబ్బంది కేటాయింపు, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాల నివారణ వంటి పలు కీలక అంశాలపై ఆయన చర్చించారు.
రాష్ట్రంలో పోలీసు బలగాల హేతుబద్ధీకరణ చేపట్టాలని, సిబ్బంది కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలు, అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఆలయాలలో అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాష్ట్రంలో నేరాల రేటు ఆరు శాతం తగ్గిందని, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలు పెరిగాయని, వీటిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి శాంతిభద్రతల నిర్వహణ అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.












