చారిత్రక హైదరాబాద్ నగరం వేగంగా 'హైరైజ్' సిటీగా మారుతోంది. అయితే, పెరుగుతున్న భవనాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై స్థానికులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో ఆకాశాన్నంటే భవనాల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 20 అంతస్తులకు మించిన సుమారు 1,800 హైరైజ్ భవనాలు ఉండగా, ఇటీవల 50-60 అంతస్తుల వరకు నిర్మితమవుతున్న ఆకాశహార్మ్యాలు వెలుస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అయితే, ఈ నిర్మాణాలకు అధికారులు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. 2024లో 124 భవనాలకు అనుమతులు లభించగా, 2025 నాటికి ఈ సంఖ్య 1,935కు చేరుకుంది. ఈ భారీ నిర్మాణాలకు అనుగుణంగా తాగునీరు, డ్రైనేజీ, రోడ్ల విస్తరణ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో జాప్యం జరుగుతోంది.












