కదిరి, జులై 04
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ శనివారం కదిరి ఆర్టీసీ బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. బస్టాండ్ ఆవరణ, ప్లాట్ఫారాల పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం ఆయన కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ను ఆకస్మికంగా సందర్శించి, క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణ అంతా తిరుగుతూ ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను, బస్టాండ్ నిర్వహణను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.












