విశాఖపట్నంలోని కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో 65 అడుగుల ఎత్తైన త్రిశూలం నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఉగాది నాటికి దీనిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు.
విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన కైలాసగిరిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్లాస్ బ్రిడ్జి, రోప్ వే, స్కై సైక్లింగ్, జిప్ లైనర్ వంటి పలు వినోద, సాహస క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉండగా, ఇప్పుడు 65 అడుగుల ఎత్తైన త్రిశూలం నిర్మాణాన్ని చేపడుతున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. గతంలో శివరాత్రి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే, వచ్చే నెలలో ఉగాది పండుగ సందర్భంగా దీనిని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.












