కామారెడ్డి, 2026-07-29
కమెడడిిలలపోలీసుసూపిటెడెట,ఐపీఎసబుధవసశివనగపోలీససటననుఆకసమికగతనిఖీశుఈసభగపోలీససటననివహణ,ికడులు,సిబబితోసమవశమైపలుకీలకసూనలుశుపిశుభత,సమథవతమైనపోలీసిగ,పసవవటిఅశలపైఆనృటిసిు
పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ సమర్థవంతమైన పోలీసింగ్కు పునాది అని, ప్రజాసేవే పోలీసు విధి అని, ప్రతి ఫిర్యాదుకు సత్వర న్యాయం అందించాలని కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్.యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ అన్నారు. బుధవారం ఆయన సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్, రైటర్ రూమ్, వివిధ రికార్డులు, సీసీటీఎన్ఎస్ నిర్వహణ, ఇతర విభాగాలను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. అనంతరం స్టేషన్ పరిసరాలను సందర్శించి పరిశుభ్రత, నిర్వహణపై పలు సూచనలు చేశారు.
పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ సిబ్బందిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి పోలీసు ఉద్యోగి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో సమయం గడపాలని, పిల్లల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలని సూచించారు. జూదం, ఆన్లైన్ గేమింగ్ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వ్యక్తిగత క్రమశిక్షణే వృత్తిపరమైన నిబద్ధతకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.











