పులివెందుల, 02-07-2026
పులివెందుల పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీసు స్పందనను మెరుగుపరిచే లక్ష్యంతో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్, వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ ప్రారంభించారు.
పులివెందుల పట్టణంలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నివారణ మరియు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన పోలీసు స్పందనను మరింత సమర్థవంతంగా అందించే లక్ష్యంతో అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (Command & Control Centre) ను కర్నూలు రేంజ్ డి.ఐ.జి డా. కోయ ప్రవీణ్ ఐ.పీ.ఎస్, వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ గురువారం సాయంత్రం ప్రారంభించారు.
పులివెందుల పోలీస్ స్టేషన్ ప్రథమ అంతస్తులో ఏర్పాటు చేయబడిన ఈ సెంటర్, నేరాలను సమర్థవంతంగా నిరోధించడం, నేరస్థులను త్వరితగతిన గుర్తించడం, ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించడం మరియు పోలీసు సేవలను మెరుగుపరచడం కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుంది. గతంలో పట్టణంలో చోటుచేసుకున్న దొంగతనాలు, దోపిడీలు వంటి సంఘటనల నేపథ్యంలో ఈ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టబడింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా, పులివెందుల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని 9 ప్రధాన కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించారు. ఈ కెమెరాలు వాహనాల రాకపోకలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, ట్రాఫిక్, శాంతిభద్రతలు మరియు అత్యవసర సంఘటనలను 24×7 పర్యవేక్షిస్తాయి. దీనివల్ల నేరాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల స్పందన వేగవంతం అవుతుంది.










