అహ్మదాబాద్లో ఏడాది క్రితం జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం, అందులో ప్రాణాలతో బయటపడిన వ్యక్తి జీవితాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. ఈ దుర్ఘటనలో 241 మంది మరణించగా, ఒకే ఒక్క వ్యక్తి అద్భుతంగా బయటపడ్డాడు.
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం, టేకాఫ్ అయిన 32 సెకెన్లకే కూలిపోయిన ఘటన యావత్తు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఈ విమానంలో, 241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జరిగి శుక్రవారంతో ఏడాది పూర్తయ్యింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ ఘోర ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ అనే వ్యక్తి ఒక్కడే అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఆనాటి భయంకరమైన సంఘటన తాలూకు జ్ఞాపకాలు అతడిని నిద్రపోనివ్వడం లేదు. ఆ చేదు అనుభవాలు అతడిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.












