తిరుపతి నగరంలోని గరుడ వారధిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదం ద్వారక (23) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
తాతయ్యగుంటకు చెందిన ఆదం ద్వారక, తిరుచానూరులో జరిగిన వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బ్లిస్ సర్కిల్ సమీపంలో గరుడ వారధిపై తన బైక్పై వెళ్తుండగా, వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ ప్రమాదంలో ద్వారక తీవ్ర గాయాలపాలై, సంఘటనా స్థలంలోనే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్వారకతో పాటు బైక్పై ఉన్న మరో వ్యక్తి స్వల్ప గాయాలతో తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం.












