జువెలరీ రంగ సంస్థ మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్, తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రకటనతో కంపెనీ షేర్లు మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
స్మాల్ క్యాప్ కేటగిరిలోని మినీ డైమండ్స్ ఇండియా లిమిటెడ్, తమ వాటాదారులకు శుభవార్తను అందించింది. కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్, 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయడానికి ఆమోదం తెలిపింది. అంటే, ప్రతి షేరుకు మరో షేరు ఉచితంగా లభిస్తుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ బోనస్ షేర్ల జారీకి అర్హులైన వాటాదారులను గుర్తించేందుకు కంపెనీ జూన్ 16ను రికార్డు తేదీగా నిర్ణయించింది. దీని అర్థం, జూన్ 16 నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉన్న వాటాదారులకు ఈ బోనస్ షేర్లు వర్తిస్తాయి.











