కామారెడ్డి, జూలై
గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట తాండలో ఆదివారం తీజ్ పండుగను మహిళలు, గ్రామస్థులు అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు రంగురంగుల దుస్తులు ధరించి, తీజ్ పూజలు చేసి, సాంప్రదాయ నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
గాంధారి మండలంలోని పిస్కిల్ గుట్ట తాండలో ఆదివారం తీజ్ పండుగను మహిళలు, గ్రామస్థులు సంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. రంగురంగుల దుస్తులతో అలంకరించుకున్న మహిళలు తీజ్ పూజలు నిర్వహించి, సాంప్రదాయ నృత్యాలు చేస్తూ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో తాండ సర్పంచ్ బాదవత్ రేనబాయి రాములు, ఉప సర్పంచ్ రాందాస్, మోతీలాల్ నాయక్, రవీందర్ కార్బరి, చత్రు, దేవిసింగ్, వార్డు సభ్యుడు ప్రకాష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామంలో ఐక్యత, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగను ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.












