నంద్యాల, 2026-06-28
నంద్యాల మండలం రైతునగరం, సుబ్బారెడ్డి పాలెం గ్రామాల మధ్య వసంత గ్రీన్ హోమ్స్ వెంచర్ సమీపంలో కేసీ కెనాల్ సబ్ బ్రాంచ్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 27-06-2026 సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నంద్యాల మండలం రైతునగరం, సుబ్బారెడ్డి పాలెం గ్రామాల మధ్య వసంత గ్రీన్ హోమ్స్ వెంచర్ సమీపంలో కేసీ కెనాల్ సబ్ బ్రాంచ్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 27-06-2026వ తేదీ సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.
లభ్యమైన మృతదేహం సుమారు 30-35 ఏళ్ల వయస్సు గల పురుషుడిది. లేత గోధుమ రంగు, లైట్ బ్లూ కలర్ చెక్స్ గీతల ఫుల్ చొక్కా, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడు. మృతదేహం తల వెనుక భాగంలో, ఎడమ కంటి రెప్ప పైన, నుదుటిపై రక్తపు గాయాలున్నాయి.
ఈ మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని పోలీసులు కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: ఆర్. ఈశ్వరయ్య, సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) - 91211010922; సురేష్, సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) - 8333955920.












