నంద్యాల, జూన్ 30
నంద్యాలలోని కాదరాబాద్ నర్సింగరావు స్మారక పురపాలక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ పదవీ విరమణ సభ ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరై, ఆయన సేవలను కొనియాడారు.
నంద్యాలలోని కాదరాబాద్ నర్సింగరావు స్మారక పురపాలక ఉన్నత పాఠశాల (పెద్ద మున్సిపల్ హైస్కూల్) ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయులు జనాబ్ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ పదవీ విరమణ సభ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ పూర్వ విద్యార్థి, రాష్ట్ర న్యాయశాఖ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, జనాబ్ సయ్యద్ అసదుల్లా హుస్సేన్ సుదీర్ఘకాలం పాటు ఎంతో అంకితభావంతో, నిష్కల్మషమైన సేవలు అందించారని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ డిఐ అస్ముద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, అనేక మంది విద్యార్థులు, ప్రముఖులు పాల్గొని, రిటైర్ అవుతున్న ప్రధానోపాధ్యాయులకు వీడ్కోలు పలికారు.












