సంగారెడ్డి, 2026-08-05
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.లలితాదేవి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొని చిన్నారులకు అన్నప్రాసన చేయించారు.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.లలితాదేవి, జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి లలిత కుమారి హాజరై చిన్నారులకు అన్నప్రాసన చేయించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శిశువు జన్మించిన తొలి గంటలోనే తల్లిపాలను ప్రారంభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని, నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని సూచించారు.
తల్లిపాలు శిశువు శారీరక, మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని, తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ప్రతి కుటుంబం తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి తల్లులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.










