కామారెడ్డి, జూలై 29
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెయిన్బో బ్లడ్ బ్యాంక్ను డీఎస్పీ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ నరహరి బుధవారం ప్రారంభించారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, స్వచ్ఛంద రక్తదానం ద్వారానే అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడవచ్చని ఈ సందర్భంగా వారు నొక్కి చెప్పారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ఇప్పటికీ ప్రత్యామ్నాయం లేదని, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసే దాతల వల్లే అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుందని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అన్నారు. ప్రతి ఆరోగ్యవంతుడు నిరంతరం రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.











