దశాబ్దాలుగా కరువు, తాగునీటి కొరత, ఫ్లోరైడ్ సమస్యలతో సతమతమవుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజలకు వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఆశాకిరణంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను నల్లమల కొండల మీదుగా తరలించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు.
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవంతో పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 10.70 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్కు తరలించి, అక్కడి నుంచి వివిధ కాలువల ద్వారా సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తొలి దశతో ప్రయోజనాలు
వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ అందుబాటులోకి రావడంతో సుమారు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 4 లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యం ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.










