అమరావతి, జూన్ 29
రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు సేవలు చిరస్మరణీయం అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అభినందించారు. హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రఘునందన్ రావు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
రాజ్యాంగ విలువలు, న్యాయపాలన పరిరక్షణలో జస్టిస్ రఘునందన్ రావు సేవలు చిరస్మరణీయం అని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ అభినందించారు.
హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్ రఘునందన్ రావు పదవీ విరమణ సందర్భంగా సోమవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది.
ఈ వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ మాట్లాడుతూ, జస్టిస్ రఘునందన్ రావు న్యాయ ప్రస్థానం, న్యాయపరమైన నిష్పాక్షికత, రాజ్యాంగ విలువల పట్ల అచంచల నిబద్ధత, న్యాయవ్యవస్థ ఆధునీకరణలో ఆయన చేసిన విశిష్ట కృషిని కొనియాడారు.
న్యాయవాదిగా విశేష అనుభవాన్ని సంపాదించిన తదుపరి న్యాయమూర్తిగా ధర్మాసనాన్ని అలంకరించి, రాజ్యాంగ స్ఫూర్తిని, న్యాయపాలనను అత్యున్నత ప్రమాణాలతో పరిరక్షించారని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన అంశాలు, సంక్లిష్టమైన సివిల్ వివాదాలు, పన్నుల సంబంధిత కేసులు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వంటి అనేక కీలక అంశాల్లో ఆయన వెలువరించిన తీర్పులు న్యాయవ్యవస్థకు మార్గదర్శకంగా నిలుస్తాయని జస్టిస్ లిసా గిల్ పేర్కొన్నారు.












