భారతదేశ క్రీడా ఆర్థిక వ్యవస్థకు నూతన ఊపునివ్వడానికి ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (Public-Private Partnership) మెరుగుపరచాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా కృషి చేస్తోందని, తద్వారా క్రీడాకారులు, యువతకు అవకాశాలు, వనరులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు.
న్యూఢిల్లీలో జరిగిన ఆదిత్య బిర్లా మెమోరియల్ పోలో కప్ ఫైనల్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (TOPS) వంటి కార్యక్రమాలు, క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి యువత రాణించడానికి, ముందుకు సాగడానికి కొత్త వేదికను అందించాయని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్, ఖేలో భారత్ పాలసీ ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని, క్రీడా సంస్థలలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తాయని మంత్రి తెలిపారు. పోలో కేవలం బలం, వేగానికి సంబంధించిన ఆట మాత్రమే కాదని, అది లయ, వ్యూహం, సమన్వయం, క్రమశిక్షణ, ధైర్యసాహసాల కలయిక అని ఆయన అభివర్ణించారు.










