తెలంగాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాల నవీకరణపై పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్లో ఉన్న తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణను పూర్తి చేయడానికి ఒక గడువును నిర్ణయించింది. ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని విద్యాసంస్థలను ఆదేశించింది.
విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ నమోదు, నవీకరణ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. శాఖ తరఫున నియమించిన ఆధార్ ఆపరేటర్లు ఆయా విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థుల వివరాలను అప్డేట్ చేస్తున్నారు. ఈ శిబిరాలకు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తప్పనిసరిగా సహకరించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
5, 15 ఏళ్ల వయస్సులో తప్పనిసరి నవీకరణ
ఆధార్ నిబంధనల ప్రకారం పిల్లలకు 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, అలాగే 15 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత బయోమెట్రిక్ వివరాలను నవీకరించాలి. ఇందులో వేలిముద్రలు, కంటి ఐరిస్ వివరాలు, తాజా ఫొటోను నమోదు చేస్తారు. చిన్న వయస్సులో నమోదైన బయోమెట్రిక్ వివరాలు పిల్లలు పెరుగుతున్న కొద్దీ మారే అవకాశం ఉండటంతో ఈ నవీకరణను చేపడుతున్నారు.











