మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) ఆకస్మిక మరణంతో ఏలూరులో విషాద వాతావరణం నెలకొంది. గుండెపోటుతో ఆయన మృతి చెందడంతో రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని ఏలూరుకు తరలించగా పలువురు నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు.
ఆళ్ల నాని పార్థివదేహాన్ని సందర్శించిన నాయకులు పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నాని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రజా జీవితంలో ఆళ్ల నాని అందించిన సేవలను పలువురు నాయకులు గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
రాజకీయ ప్రస్థానం
ఆళ్ల నాని ఏలూరు కేంద్రంగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు.











